జైనథ్, జనవరి 31 : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తలు బీభత్సం సృష్టించారు. దొంగలు ఆలయ ప్రధాన గేట్కు పైన రంద్రం చేసి ఆలయంలోకి చొర బడ్డారు. ఆలయం రెండో గేటుకు తాళం ఉండగా.. ఆలయంలో ఉన్న ప్రధాన హుండీని పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారు. దీంతో శబ్దం కావడంతో దొంగలు వెనుతిరిగారు.
ఆలయ ఆవరణలో గల శివాలయంలోని హుండీని అహరించి, అందులో ఉన్న సుమారు రూ.4 వేలను దొంగలించారు. హుండీని ఆలయం ఎదుట గల చెరువు కట్టపై పడేశారు. దొంగతనంపై ఆలయ కమిటీ చైర్మన్ అడ్డి రుకేశ్రెడ్డి, ఆలయ అర్చకులు వెంకన్న, ఎండోమెంట్ అధికారి సాయి, ఎస్సై గౌతం పవార్కు శనివారం ఫిర్యాదు చేయగా పోలీస్ డాగ్ స్కాడ్తో దర్యాప్తు చేస్తున్నారు.