రమణ్, ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. సిరి మూవీస్ పతాకంపై కె శిరీషా రమణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం రమేష్, గోపి దర్శకత్వం వహించారు. వినోద్ కుమార్ మరో కీలక పాత్రలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా హీరో రమణ్ మాట్లాడుతూ..‘గతంలో దర్శకుడు వినాయక్ విడుదల చేసిన టీజర్, హీరో రామ్ చరణ్ రిలీజ్ చేసిన పాటకు మంచి స్పందన వస్తున్నది. కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుంది. హైదరాబాద్, గోవా, రాయలసీమలోని పలు అందమైన లొకేషన్లలో సినిమాను చిత్రీకరించాం. అందరినీ ఆకట్టుకునే చిత్రమవుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కేఏ ఆనంద్, సంగీతం : మహిత్ నారాయణ్.