కొలంబో: టాపార్డర్ తడబడటంతో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ వెనుకంజలో పడింది. సోమవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. కెప్టెన్ బ్రాత్వైట్ (41) ఫర్వాలేదనిపించగా.. మిగిలినవాళ్లు విఫలమయ్యారు. లంక బౌలర్లలో రమేశ్ 3, ప్రవీణ్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 386 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ దిముత్ కరుణరత్నె (147) భారీ సెంచరీతో కదం తొక్కగా.. ధనంజయ డిసిల్వ (61), దినేశ్ చండిమాల్ (45) రాణించారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 5, వారికన్ మూడు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో 4 వికెట్లు ఉన్న విండీస్.. లంక తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 273 పరుగులు వెనుకబడి ఉంది. హోల్డర్ (1), మయేర్స్ (22) క్రీజులో ఉన్నారు.