మహబూబ్నగర్, డిసెంబర్ 8 : రాష్ట్రంలోని ఆడబిడ్డల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్ట వద్ద మంత్రి సొంత నిధులు రూ.13.70 లక్షలతో నిర్మించిన అష్టలక్ష్మి మహిళా మండలి కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని తెలిపారు. ఆర్థికంగా ఆడబిడ్డలు ఉంటే ఆ ఇల్లు మరింత ఉన్నతస్థాయికి చేరుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని రాష్ట్రంలోనే నంబర్వన్ స్థానంలో నిలుపుదామని పిలుపునిచ్చారు. గతంలో పట్టణంలో తాగునీటి గోస తీవ్రం గా ఉండేదని, నేడు మిషన్ భగీరథతో నీటి కష్టాలకు చెక్ పడిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్, టీఆర్ఎస్ నేత జూపల్లి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.
ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠాపన పోస్టర్ విడుదల
హన్వాడ మండలం కొత్తపేట గ్రామంలోని దాసాంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠాపన మహోత్సవ వాల్పోస్టర్ను బుధవారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయు లు, ఎంపీటీసీ అరుణ్, ఉపసర్పంచ్ రాములు, మార్కె ట్ కమిటీ డైరెక్టర్ బాల చెన్నయ్య, టీఆర్ఎస్ గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డబ్బా రాములు పాల్గొన్నారు.