కరీంనగర్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పదవిని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా ఐదేళ్ల కాల పరిమితి ఈ నెల 9తో ముగిసింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం మరో రెండేళ్లపాటు చైర్మన్ పదవి కొనసాగించడానికి నిర్ణయించి ఈ మేరకు ఉత్తర్వుల జారీ చేసింది. మరో రెండేళ్లపాటు తనకు చైర్మన్గా కొనసాగించడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కోలేటి దామోదర్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. తన పదవికి మరింత వన్నె తెస్తానని, ముఖ్యమంత్రి ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని చెప్పారు. దామోదర్ పదవీ కాలం పొడిగింపుపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.