న్యూఢిల్లీ, మార్చి 5: దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్ ఎన్ఎస్ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ అరెస్ట్కు రంగం సిద్ధమైంది. ఆమె పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఎన్ఎస్ఈ కో-లోకేషన్ కుంభకోణంలో ప్రధాన సూత్రదారి అయిన చిత్రా రామకృష్ణను ఇటీవల సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ముందస్తు అరెస్ట్పై ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను ప్రత్యేక కోర్టు జడ్జీ సంజీవ్ అగర్వాల్ తిరస్కరించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేయడానికి లైన్క్లియర్ అయింది. ఈ కేసులో ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ..ముంబై, చెన్నైలలో చిత్రా రామకృష్ణకు ఉన్న ఆస్తులపై దాడులు చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఆనంద్ సుబ్రమణియన్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నది సీబీఐ.