కెరమెరి, జనవరి 9 : మహరాజ్గూడ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న జంగుబాయి జాతర భక్తులతో కోలాహలంగా మారింది. సోమవారం తెలంగాణ, మహారాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని ఆరాధించారు. భక్తులు టోప్లకస వద్ద పూజలు చేసి, పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం పవిత్ర జలంతో ఆలయ ప్రాంగణానికి తరలివచ్చి, పోచమ్మ, రావుడ్క్పేన్, మైసమ్మకు పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా గుహల వద్దకు చేరుకొని, అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ భక్తులతో పాటు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ వచ్చారు.