రణ్బీర్కపూర్, అమితాబ్బచ్చన్, నాగార్జున, షారుఖ్ఖాన్ (అతిథి పాత్రలో) నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో ద్వితీయ భాగాన్ని రాబోవు రెండు మూడు మాసాల్లో సెట్స్మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర దర్శకుడు ఆయాన్ ముఖర్జీ తెలిపారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. ఈ సందర్భంగా ఆయాన్ ముఖర్జీ మాట్లాడుతూ “బ్రహ్మస్త్ర-2 ‘(దేవ్ అండ్ ఆస్ట్రావర్స్’) కోసం అంతా సిద్ధమవుతున్నది.
ఈ సినిమా అపూర్వ విజయం నాకు నూతనోత్సాహాన్నిచ్చింది. ద్వితీయ భాగం కథ గురించి అభిమానులు తమ ఆలోచనల్ని, ఉహల్ని నాతో పంచుకున్నారు. వాటిని కొన్నింటిని కథలో జోడించాలనుకుంటున్నాం. రెండు, మూడు భాగాల్ని వరుసగా తెరకెక్కించేందకు సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. ద్వితీయ భాగంలో కూడా రణ్బీర్కపూర్ బ్రహ్మాస్ర్తాన్ని రక్షించే శివ పాత్రలోనే కనిపిస్తాడని అయాన్బముఖర్జీ వెల్లడించారు. ఆయన లక్ష్యానికి సహకరించే వీరుల పాత్రల్లో కొందరు అగ్ర హీరోలు ద్వితీయ భాగంలో కనిపిస్తారని చెప్పారు.