యాదాద్రి, డిసెంబర్ 28: పీఏసీఎస్ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ హెచ్ఆర్ పాలసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. సహకార సంఘం ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్ దేనని తెలిపారు.యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం పీఏసీఎస్ ఉ ద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సిలువేరు శేఖర్గౌడ్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ పీఏసీఎస్ చైర్మన్లకు ప్రొటోకాల్ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఫైల్ సీఎం కేసీఆర్ వద్ద ఉందని, త్వర లో ఆమోదం తెలుపనున్నట్లు వెల్లడించారు.
డీసీసీబీ రూ. 30 కోట్ల కుంభకోణం నుంచి తేరుకోవడానికి అనేక పాట్లు పడినట్లు తెలిపారు. అప్పుల ఊబీలో కూరుకుపోయిన డీసీసీబీకి చైర్మన్గా ప్రమాణం చేసిన అనంతరం అనేక నూతన పాలసీలు తీసుకువచ్చిలా భాల్లోకి తెచ్చామన్నారు. అనంతరం ఆలేరు మం డలంలోని పటేల్గూడెం గ్రామానికి చెందిన రైతు బొశెట్టి రాజుకు సహకార బ్యాంకు కింద మంజూరైన రూ.7.80 లక్షల విలువగల ట్రాక్టర్ను డీసీసీబీ చైర్మన్ అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు ఇమ్మ డి రామిరెడ్డి, మొగులగాని మల్లేశ్గౌడ్, సింగిరెడ్డి నర్సింహారెడ్డి, గూదె బాలనర్సయ్య, చింతలపూడి భాస్కర్రెడ్డి, డైరెక్టర్లు కూళ్ల సిద్దులు, చింతకింద చంద్రకళ, గవ్వల నర్సింహులు, సుందర్ పాల్గొన్నారు.