కవాడిగూడ : తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన న్యాయవాదులను సీఎం కేసీఆర్ గుర్తించి వారికి బీసీ కమిషన్ సభ్యులుగా నియమించడం అభినందనీయమని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ ట్రిబ్యూనల్ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఇటీవల నియామకమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ నూతన చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద పాటిల్, కిషోర్గౌడ్లు బీసీ భవన్లో ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా వారిని కలిసి పూల బొకేను అందజేసి షాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పులిగారి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ బీసీకమిషన్ సభ్యులుగా సమర్ధవంతంగా పనిచేసి తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. న్యాయవాదులను బీసీ కమిషన్ సభ్యు లుగా నియమించిన సీఎం కేసీఆర్కు ఆయన తెలంగాణ అడ్వకేట్ జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఎలక్టిక్ రెగ్యూలేటరీ కమిషన్ చైర్మన్ ఎన్. శ్రీరంగారావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.