ఇస్తాంబుల్: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ (52 కేజీలు) క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. ఇస్తాంబుల్ వేదికగా ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్లో నిఖత్ 5-0 తేడాతో లుట్సైఖాన్ అల్తాంట్సెట్సెగ్ (మంగోలియా)ను చిత్తు చేసింది. ఆది నుంచి తన పంచ్లతో విరుచుకుపడిన నిఖత్.. మంగోలియా అమ్మాయికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది.
సోమవారం జరిగే క్వార్టర్స్లో చార్లే డేవిసన్ (ఇంగ్లండ్)తో నిఖత్ అమీతుమీ తేల్చుకోనుంది. పర్వీన్ (63 కే), అనామిక (50కే), మనీషా (57 కే), నీతూ (48 కే), పూజారాణి (81కే), నందిని (81+ కే)లు కూడా క్వార్టర్స్లోకి ప్రవేశించారు. పర్వీన్ 5-0తో జజైరా (అమెరికా)పై విజయం సాధించగా.. అనామిక క్రిస్టిలీ (ఆస్ట్రేలియా)ను చిత్తు చేసింది. 54 కేజీల విభాగంలో శిక్ష మంగోలియా బాక్సర్ చేతిలో ఓటమిపాలైంది.