వనపర్తి : రైతు వేదికలను అన్నదాతలు సద్వినియోగం చేసుకునాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
జిల్లాలోని కొత్తకోట మండలం అమడబాకుల గ్రామంలో 33/11కెవి విద్యుత్ సబ్ స్టేషన్, రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాలను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని మంత్రి తెలిపారు. అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేని ఆయన పేర్కొన్నారు.
5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు ఏఈఓలను నియమించినట్లు వెల్లడించారు.
గతంలో సాగుపద్ధతిపై రైతులు సలహాలు సూచనల కోసం మండల కేంద్రానికి వచ్చేవారని ప్రస్తుతం గ్రామాల్లోనే వారి సందేహాలు తీరుతున్నాయన్నారు కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రామన్ గౌడ్, కలెక్టర్ యాస్మిన్ భాషా తదితరులు పాల్గొన్నారు.