రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బన్సీలాల్పేట్, నవంబర్ 20: చేపలు పట్టే వృత్తిలో జీవిస్తున్న ముదిరాజ్ కులస్తుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కోరారు. శనివారం 33 జిల్లాల అధ్యక్షులతో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని న్యూబోయిగూడలోని ముదిరాజ్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్లను బీసీడీ నుంచి ఏ గ్రూప్లో చేర్చాలని కోరారు. అనేక ఏండ్లుగా న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. 82 శాతం ముదిరాజ్లున్న మత్స్యకార సొసైటీల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 20న పరేడ్ మైదానంలో తలపెట్టిన ‘ముదిరాజ్ ప్రభంజనం’ భారీ బహిరంగ సభను ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేస్తున్నామన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ముదిరాజ్లు మరింత అభివృద్ధి చెందాలన్నారు. సమావేశంలో ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు డి.సదానంద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జగదీశ్ ప్రసాద్, సి.వెంకటేశం, కాసాని వీరేశ్, ఎం.శారద, ఎం.ప్రకాశ్, చంద్రమోహన్, టి.సురేందర్, టి.శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.