శంషాబాద్ రూరల్, నవంబర్ 25: ఎయిర్పోర్టు ప్రహరీని ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. శంషాబాద్ రూరల్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పోశెట్టిగూడ గ్రామానికి చెందిన గుంటి నవీన్(20)బుధవారం తన స్నేహితుల వివాహం ఉండటంతో గ్రామానికి వెళ్లి.. రాత్రి ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. రషీద్గూడ బస్టాండ్ వద్ద మూలమలుపు చూసుకోకుండా వేగంగా రావడంతో అదుపు తప్పి.. ఎయిర్పోర్టు ప్రహరీని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.