అమీర్పేట్, సెప్టెంబర్ 5: ఈ నెల 7 నుంచి కోయంబత్తూరులో జరిగే దక్షిణ మండలం డెఫ్ టీ20 క్రికెట్ ఛాంపియన్షిప్కు మూగ, చెవిటి క్రీడాకారులు 14 మందితో కూడిన క్రికెట్ టీమ్ను తెలంగాణ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ద డెఫ్ సోమవారం ప్రకటించింది. ఇటీవల డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జింఖానా గ్రౌండ్స్లో పోటీలు నిర్వహించి.. ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసినట్లు ప్రధాన కార్యదర్శి వలీఉద్దీన్ తెలిపారు.