తిరుపతి, జూలై: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. కరోనా కారణంగా ఈ కార్యక్రమాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. అందులో భాగంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, మహాపూర్ణాహుతి, పవిత్ర సమర్పణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీపనైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం పంచ మూర్తులకు ఆస్థానం నిర్వహించనున్నారు.