‘ఊ అంటావా..’ అంటూ సమంత విసిరిన వలపు మంత్రానికి యావత్ కుర్రకారు దాసోహమయ్యారు. చూపుతిప్పుకోనివ్వని అందచందాలు, హుషారెత్తించే నృత్యంతో ఈ భామ రసహృదయుల్ని ఫిదా చేసింది. ‘పుష్ప’ సినిమాలో ఈ ఐటెంసాంగ్తో సమంత దేశవ్యాప్తంగా యువతరాన్ని ఉర్రూతలూగించింది. సోషల్మీడియాలో ఎన్నో రికార్డుల్ని బ్రేక్ చేసిందీ పాట. తాజాగా ఓ అవార్డుల ప్రదాన కార్యమ్రంలో ఈ ప్రత్యేకగీతంపై సమంత స్పందించింది. ‘ఊ అంటావా..’ ఐటెంసాంగ్కు పాన్ఇండియా స్థాయిలో ఆదరణ లభిస్తుందని ఊహించలేదని చెప్పింది. ఓ తెలుగు పాట వివిధ భాషల్లోని మారుమూల ప్రేక్షకులకు కూడా చేరువకావడం ఆశ్చర్యంగా అనిపిస్తున్నదని పేర్కొంది. ‘ఈ పాటలో నా నృత్యం, హావభావాలు చాలా బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. గతంలో నేను చేసిన సినిమాలన్నీ మర్చిపోయి ఈ పాటను మాత్రమే గుర్తుచేస్తున్నారు. ఏదిఏమైనా కెరీర్లో చేసిన తొలిఐటెంసాంగ్ ఇంతటి ప్రాచుర్యం సంపాదించుకోవడం ఆనందంగా ఉంది’ అని సమంత తెలిపింది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘శాకుంతలం’ ‘యశోద’ చిత్రాల్లో నటిస్తున్నది.