ముంబై: టీమ్ఇండియాకు టీ20 ప్రపంచకప్ అందించడమే తన లక్ష్యమని వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో (34 బంతుల్లో 66 నాటౌట్) బెంగళూరును విజయ తీరాలకు చేర్చిన కార్తీక్తో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ప్రత్యేక ఇంట ర్వ్యూ చేశాడు. ఇందులో భాగంగా కార్తీక్ మాట్లాడుతూ.. ‘నాకు ఇప్పుడు స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నాయి. బెంగళూరును గెలిపించడం స్వల్ప లక్ష్యం కాగా.. భారత్కు ప్రపంచకప్ అందించడం దీర్ఘకాలిక లక్ష్యం. ఈసారి జరిగే టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలని భావిస్తున్నా. భారత జట్టు మెగాట్రోఫీ సాధించి చాలా కాలమైంది. నేను ఇప్పుడు దాన్ని సాధించి పెట్టాలనే పట్టుదలతో ఉన్నా’అని అన్నాడు.