కోల్కతా: బెంగాల్లోని టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో మాజీ మంత్రి పార్ధా ఛటర్జీ, మోడల్ ఆర్పితా ముఖర్జీలను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తనను డివిజన్ వన్ ప్రిజన్ క్యాటగిరీలో ఉంచాలని అర్పిత కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ఈడీ అడ్వకేట్ ఫిరోజ్ ఎదుల్జీ అర్పిత తరపున వాదించారు. ఆమె ప్రాణానికి ముప్పు ఉన్నట్లు పేర్కొన్నాడు. నలుగురు కన్నా ఎక్కువ ఖైదీలు ఉన్న రూమ్లో ఆమెను ఉంచరాదని కోర్టును కోరాడు. అర్పితకు ఇచ్చే ఆహారం, నీళ్లను మొదటగా పరీక్షించాలని, ఆ తర్వాతే ఆమెకు ఇవ్వాలని ఈడీ లాయర్ తెలిపారు.