శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ఉన్న ఆరేహ్ మోహన్పురాలో ఉన్న ఎలాహి దేహతి బ్యాంక్ మేనేజర్ ను ఉగ్రవాదులు హతమార్చారు. మేనేజర్ క్యాబిన్లో ఉన్న విజయ్ కుమార్ను ఓ ఉగ్రవాది తన చేతుల్లో ఉన్న తుపాకీతో కాల్చేశాడు. రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో.. మేనేజర్ అక్కడే కుప్పకూలిపోయాడు. అయితే గాయాలు తీవ్రం కావడంతో ఆయన్ను హాస్పిటల్కు తరలించారు. ఆ సమయంలో మేనేజర్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఉగ్రవాది తన బ్యాగులో తుపాకీ పెట్టుకుని .. మేనేజర్ రూమ్లోకి వస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫూటేజీకి చిక్కాయి. మేనేజర్ క్యాబిన్ వద్దకు ఉగ్రవాది చేరుకుని అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపాడు. దానికి సంబంధించిన వీడియో ఇదే.
#WATCH | J&K: Terrorist fires at bank manager at Ellaqie Dehati Bank at Areh Mohanpora in Kulgam district.
The bank manager later succumbed to his injuries.
(CCTV visuals) pic.twitter.com/uIxVS29KVI
— ANI (@ANI) June 2, 2022