వ్యవసాయ యూనివర్సిటీ , జనవరి 1: రాష్ట్రంలో పంటల సాగులో మార్పు వస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం రావడంతో రైతు మరింత ఉత్సాహంగా కూరగాయల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. గత రెండేండ్లు వరిని పండించారు కేంద్ర ప్రభుత్వం వరి కొనమని చెప్పడంతో కూరగాయలు, ఆకుకూరలు నూనెగింజలు తదితర పంటల వైపు ఇప్పటికే 50 శాతం మంది పంట మార్పిడి చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు దాదాపు 20 వేల క్వింటాళ్ల కూరగాయల అవసరం ఉందని గుర్తించారు , రాజధాని నగరం హైదరాబాద్ వినియోగదారులకు రోజుకు 7500 క్వింటాళ్ల కూరగాయలు అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులతో ఉద్యాన శాస్త్రవేత్తలు, అధికారుల సూచనమేరకు కూరగాయలు పండిస్తే మరింత లాభాలు పొందవచ్చని శ్రీ కొండా లక్ష్మణ్ విశ్వవిద్యాలయం కళాశాల డీన్ డా గిర్వాణి శాస్త్రవేత్తలు , రాజాగౌడ్, నారాయణ , వెంకట లక్ష్మి , నాగహర్షిత తదితరులు సూచించారు.