బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న తెలుగు టైటాన్స్కు మరో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన పోరులో టైటాన్స్ 25-43తో తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమి పాలైంది. పాలమూరు రైడర్ గల్లా రాజు 9 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలువగా.. అతడికి ఇతర ఆటగాళ్ల నుంచి సరైన సహకారం లభించలేదు. మొత్తం 14 రైడ్లు చేసిన రాజు… ఏడు టచ్ పాయింట్లు సాధించడంతో పాటు.. ట్యాక్లింగ్లోనూ ఇద్దరు ప్రత్యర్థి ఆటగాళ్లను ఉడుం పట్టుపట్టాడు. కెప్టెన్ రోహిత్ కుమార్ (3), ఆదర్శ్ (4), ఆకాశ్ (2), అరుణ్ (0) విఫలమయ్యారు. తలైవాస్ తరఫున అజింక్యా పవార్ (10), సాగర్ (9), మన్జీత్ (9) రాణించారు. తాజా సీజన్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్లాడిన టైటాన్స్కు ఇది 11వ పరాజయం కాగా.. ఒకే ఒక్క మ్యాచ్ నెగ్గిన తెలుగు జట్టు 22 పాయింట్లతో పట్టిక అట్టడుగున కొనసాగుతున్నది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 36-30 తేడాతో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది.