హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ఖరీఫ్లో రాష్ట్ర రైతులకు డీఏపీ ఎరువుల కొరత తలెత్తకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఈమేరకు శుక్రవారం లేఖ రాశారు. ప్రస్తుతం 50 శాతం వరినాట్లు పూర్తయ్యాయని, మిగిలినవి ఆగస్టులో పూర్తికానున్నందున డీఏపీ అవసరం పెరుగుతున్నదని వివరించారు. ఆగస్టు నెలకు 0.50 లక్షల మెట్రిక్ టన్నులు, సెప్టెంబర్ నెలకు మరో 0.50 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీని కేటాయించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
హిమాయత్నగర్, జూలై31: ఆగస్టు 2న హిమాయత్నగర్లో నిర్వహిస్తున్న తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ రాష్ట్ర మహాసభలను సక్సెస్ చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పీ ప్రేమపావని తెలిపారు. శుక్రవారం హిమాయత్నగర్లోని ఎస్ఎన్రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యల్లో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.