హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,047 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారినపడి ముగ్గురు మృత్యువాతపడ్డారు. మహమ్మారి నుంచి 2,013 మంది కోలుకున్నారు. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,09,209కు పెరిగింది. ఇందులో 6,83,104 మంది కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో మొత్తం 4,057 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ మరణాల రేటు 0.57శాతంగా ఉందని, రికవరీ రేటు 96.31శాతంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇవాళ 55,883 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు వివరించింది. 24 గంటల్లో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1174 నమోదయ్యాయి.