సుల్తాన్ బజార్, డిసెంబర్ 6: విద్యార్థులు నిర్మాణాత్మకంగా ఉండటంతో పాటు పుస్తకాలను బాగా చదవాలని తెలంగాణ ఆర్థిక రంగ ప్రభుత్వ సలహాదారులు, ఆర్ధిక నిపుణులు డాక్టర్ జీఆర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యలో అనేక సంస్కరణలను తీసుకొచ్చిన క్రమం లో కొన్నేండ్ల క్రితం మూతబడిన బీఏ ఆనర్స్ కోర్సును తిరిగి ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా నిజాం కళాశాలలో బీఏ ఆనర్స్ ఇన్ ఎకనామిక్ కోర్సులో చేరిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.నారాయణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, బీఏ ఆనర్స్ కోర్సులో చేరిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
ప్రధానంగా విద్యార్థులు ఎకనామిక్, టైమ్స్ వంటి దిన పత్రికలను చదవాలన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండ లి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ బీఏ ఆనర్స్ కోర్సు ఎంతో సబ్జెక్టు అని అన్నారు. ప్రధానంగా వెనుకబడిన విద్యార్థులు, వివిధ గ్రామాల నుంచి వచ్చే వారికి చక్కటి అవకాశం అని అన్నారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఇ.రేవ తి, ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, జీ ఓం ప్రకాష్, డీ ఇంద్రకాంత్, జే నర్సింహారావు, ఓయూ బీఓఎస్, ఓయూ ఎకనామిక్స్ అధ్యక్షులు డైసీ, డాక్టర్ ఇటిక్యాల పురుషోత్తం, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రంజని, కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం విజ్జులత, డాక్టర్ పరిమళ కులకర్ణి, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ చాంద్ పాషా, కంట్రోలర్ ఆఫ్ గ్జామినేషన్ డాక్ట్టర్ బాల బ్రహ్మచారి, పీఆర్వో డాక్టర్ కసప నరేందర్, డాక్టర్ కమలాకర శర్మ పాల్గొన్నారు.