హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ)/హిమాయత్నగర్/ఉస్మానియా యూనివర్సిటీ/చిక్కడపల్లి : గౌడ వృత్తిని కించపరిచేలా మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గౌడలకు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు వట్టికూటి రామారావుగౌడ్ డిమాండ్ చేశారు. గౌడ వృత్తిని కించపరిస్తే మసైపోతావని హెచ్చరించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవం కాపాడుకుంటూ, కల్లు వృత్తితో ఉపాధి పొందుతున్న గౌడ్స్ను అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. గౌడల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే మసైపోతారని హెచ్చరించారు.