హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు అందించిన నోటీసుల పరిషార ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం మరిం త సులభతరం చేసింది. ఇప్పటివరకు సినీ ప్రముఖులు, వీఐపీలు, వృద్ధుల కుంటుబసభ్యుల్లో ఒక్కరికి మాత్రమే హియరింగ్కు అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం.. ఇ ప్పుడు అందరికీ అవకాశం కల్పించింది. నోటీసులు అందిన ఓటరు కుటుంబసభ్యు ల్లో ఎవరైనా ఒకరు ఈఆర్వో, ఏఈఆర్వోల ఎదుట వ్యక్తిగతంగా హాజరై ఓటరుకు సంబంధించిన అవసరమైన పత్రాలు, స మాచారాన్ని అందించవచ్చని సీఈవో సుదర్శన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఓటర్ కుటుంబసభ్యుల నుంచి అవసరమైన పత్రాలను స్వీకరించి జారీ చేసిన నోటీసుల పరిషారానికి చర్యలు చేపట్టాల ని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జి ల్లా ఎన్నికల అధికారులకు దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించామని, దా నికి అనుగుణంగా ఓటర్లకు ఇచ్చిన నోటీసులను పరిశీలించి వాటి పరిషారానికి కృషి చేయాలని సూచించారు. ఇప్పటివరకు పెం డింగ్లో ఉన్న ఫామ్-6 దరఖాస్తులకు, భ విష్యత్తులో అందే ఫామ్-6 దరఖాస్తులకు సంబంధించి నిర్దేశిత డిక్లరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా స్వీకరించాలని ఆదేశించారు.