హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహారదీక్షకు సోమవారంతో 12 ఏండ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తం గా పలు దేశాల్లో దీక్షాదివస్ను నిర్వహించాలని టీఆర్ఎస్ ఎన్నా రై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆదివారం పిలుపునిచ్చారు. 2009 నవంబర్ 29న సీఎం కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమ గతిని మార్చేసిందని చెప్పారు. తెలంగాణ సమాజం యావత్తు కేసీఆర్ వెంట నిలిచిందని, కేంద్రం మెడలు వంచి ఆయన రాష్ర్టాన్ని సాధించారని గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో దీక్షాదీవస్ స్ఫూర్తి, అమరుల త్యాగాలు, జ్ఞాపకాలు, పోరాటాలకు గుర్తింపుగా ప్రపంచ దేశాల్లో దీక్షాదివస్ నిర్వహించాలని కోరారు. ఇదే వేదికలో తెలంగాణ అమరులు ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్, నాయిని నర్సింహారెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, నోముల నర్సింహయ్య తదితరులకు నివాళి అర్పించాలని విన్నవించారు. అ మెరికాలోని అట్లాంటా, న్యూజెర్సీలో జరిగే కా ర్యక్రమాల్లో తానూ పాల్గొంటానని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ఖతార్శాఖ ఆధ్వర్యంలో దోహా లో ఆదివారం దీక్షాదివస్ నిర్వహించారు. రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరవీరులకు నివాళి అర్పించారు. మహేశ్ బిగాల పిలు పు మేరకు ఈ కార్యక్రమం జరిపినట్టు ఖతార్ అధ్యక్షుడు శ్రీధ ర్ అబ్బగోని తెలిపారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు శంకర్ సుందరగిరి, ఎల్లయ్య తాళ్లపెళ్లి, సాయితేజ కుంభాజి, రాజీరెడ్డి మాసం, శంకరాచారి బొప్పరపు, రా జు కుందూరు, ప్ర వీణ్ మోతే, శేఖర్ అల్లకొం డ, మీరా నర్సయ్య, బత్తిని భాసరగౌడ్, నర్స య్య, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.