హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ స్థాయి ఆర్చరీ చాంపియన్షిప్లో తెలంగాణ చిన్నారి వి.అక్షారెడ్డి పసిడి పతకం కైవసం చేసుకుంది. లక్నో వేదికగా జరిగిన 11వ జాతీయ స్థాయి ఫీల్డ్ ఇండోర్ ఆర్చరీ చాంపియన్షిప్ అండర్-10 కాంపౌండ్ విభాగంలో అక్షారెడ్డి గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించింది. బంగారు పతకం కైవసం చేసుకున్న అక్ష ప్రస్తుతం హైదరాబాద్ నానక్రామ్గూడలోని ఫ్యూచర్ కిడ్స్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నది. స్వామి నేతృత్వంలో అక్ష ఆర్చరీలో శిక్షణ పొందింది. ఈ విజయంపై అక్ష కుటుంబ సభ్యులతోపాటు కోచ్ స్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో అన్ని రాష్ర్టాల నుంచి దాదాపు 800 మంది ఆర్చర్లు పాల్గొన్నారు.