బళ్లారి: జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు) సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్.. మహారాష్ట్రకు చెందిన రుషికేశ్ గౌడ్ను నాకౌట్ చేశాడు. స్టార్ బాక్సర్, ఐదుసార్లు ఆసియా చాంపియన్షిప్ మెడలిస్ట్ శివ థాపా (64 కేజీలు) కూడా సెమీస్లో అడుగుపెట్టాడు. హోరాహోరీగా సాగిన క్వార్టర్స్లో థాపా 4-1తో అంకిత్ నర్వాల్ను చిత్తు చేశాడు. ఇతర విభాగాల్లో సచిన్, వరీందర్ సింగ్, రవి కుమార్ కూడా సెమీఫైనల్కు చేరారు.