ఖైరతాబాద్ : హెల్త్ హబ్గా రాష్ట్రం రూపుదిద్దుకుంటున్నదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణగా ఆవిర్భవిస్తున్నదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఎంఎస్ మక్తాలోని ఖైరతాబాద్ యూపీహెచ్సీ పరిధిలో పనిచేస్తున్న 18 మంది ఆశా వర్కర్లకు మంగళవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ సెల్ఫోన్లను అందజేశారు.
కరోనా సమయంలో వారి సేవలు వెలకట్టలేవని, వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. సెల్ ఫోన్లు అందించిన ఎమ్మెల్యే దానంకు ఆశా వర్కర్లు స్వీట్లు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ ఖైరతాబాద్లోని ఐమాక్స్ ఎదురుగా ఉన్న హెచ్ఎండీఏ స్థలంలో త్వరలోనే కోట్లాది రూపాయలతో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నామని, ఆ స్థలంలోనే వంద గజాలను యూపీహెచ్సీకి కేటాయిస్తామని, ఈ మేరకు మంత్రి కేటీఆర్తో మాట్లాడి నిధులు సైతం మంజూరు చేయిస్తామన్నారు.
స్థల కేటాయింపు విషయంపై అప్పటికప్పుడే జోనల్ కమిషనర్ రవికిరణ్తో ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే ఖైరతాబాద్లో ప్రభుత్వ దవాఖాన అందుబాటులోకి వస్తుందని, బస్తీ దవాఖాన ద్వారా వైద్య సేవలందుతున్నాయని, తాజాగా యూపీహెచ్సీని సైతం ఏర్పాట చేసుకుంటే ప్రజలందరకీ నాణ్యమైన ఉచిత ప్రభుత్వ వైద్యం అందుతుందన్నారు.
టీఆర్ఎస్ నాయకులు వనం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వనం సంగీత యాదవ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఎస్కె అహ్మద్, ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు, సలావుద్దీన్, బీసీ సెల్ అధ్యక్షులు ఆనంద్ గౌడ్, నాయకులు సారంగపాణి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.