మాల్మో (స్వీడన్): టెపె సెజిమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఎరిగేసి రన్నరప్గా నిలిచాడు. స్వీడన్ వేదికగా రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన టోర్నీలో సోమవారం ఆఖరి రౌండ్ను ‘డ్రా’ చేసుకుని అర్జున్ నాలుగు పాయింట్లతో రెండో స్థానంలోనిలువగా.. ఐదు పాయింట్లతో అమెరికా జీఎం హన్స్ మోకె నైమన్ టైటిల్ పట్టాడు. ఏడో రౌండ్లో అర్జున్ 59 ఎత్తుల్లో డేవిడ్ నవరా (జెక్ రిపబ్లిక్)తో ‘డ్రా’ చేసుకున్నాడు. అంతకుముందు ఆదివారం నిల్స్ గండెలియస్ (స్వీడన్), మిచేల్ ఆడమ్స్ (కెనడా)తో జరిగిన బోర్డులను కూడా ఈ తెలంగాణ కుర్రాడు ‘డ్రా ’గా ముగించాడు.