చేర్యాల, డిసెంబర్ 15: దేవాదాయశాఖలో రూ.144 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నదని, దానిని ఖర్చు చేయడానికి అర్చ క వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని అర్చక జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ ప్రభుత్వాన్ని కోరారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో బుధవారం అర్చక దేవాదాయ శాఖ, అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పరాశరం రవీంద్రాచార్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తన ఆధ్యాత్మిక భావనలు, తన ఆలోచనలతో ఆలయాల అభివృద్ధి, అర్చక ఉద్యోగులకు జీవో 577 ఆధారంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాలు అందిస్తున్న విధంగా, మరో 100 మంది అర్చక ఉద్యోగులు, చిన్న దేవాలయాల ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాలు రావాల్సి ఉన్నదన్నారు.
మంత్రి హరీశ్ను కలిసిన అర్చక ఉద్యోగ జేఏసీ
రాష్ట్రంలోని అర్చకులకు ప్రతి నెలా ఐదోతేదీలోగా వేతనాలివ్వాలని కోరుతూ అర్చక ఉద్యోగ జేఏసీ నేతలు బుధవారం ఆర్థిక మంత్రి హరీశ్రావుకు వినతిపత్రాన్ని సమర్పించారు. అర్చక ఉద్యోగులతోపాటు ధూపదీప నైవేద్య అర్చకులకు హెల్త్కార్డులు అందించాలని జేఏసీ నేతలు గంగు ఉపేంద్రశర్మ, రాజేశ్వరశర్మ విజ్ఞప్తిచేశారు.