Loksabha Elections 2024 | లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం ధించి అధికార పగ్గాలు చేపడితే అగ్నివీర్ స్కీమ్ను రద్దు చేస్తామని ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు. అగ్నివీర్ పధకం కేవలం నాలుగేండ్ల వ్యవధే కావడంతో ఎక్కువ సమయం శిక్షణకే సరిపోతుందని అన్నారు.
అగ్నివీర్లో అమరవీరుల హోదా లేదని, క్యాంటిన్ సదుపాయం లేదని, పెన్షన్ కూడా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ఏమాత్రం ప్రయోజనం లేని అగ్నివీర్ పధకాన్ని రద్దు చేస్తామని చెప్పారు. సైనిక నియామకాల్లో పాత పద్ధతినే ముందుకు తీసుకువెళతామనితేజస్వి యాదవ్ తేల్చిచెప్పారు.
ఇక సైనిక నియామకాలకు ఉద్దేశించిన అగ్నివీర్ స్కీమ్ను రద్దు చేస్తామని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సైతం ఇటీవల హామీ ఇచ్చారు. గౌతంబుద్ధనగర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అఖిలేష్ మాట్లాడుతూ అగ్నివీర్ స్కీమ్పై యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమ కూటమి అధికారంలోకి రాగానే అగ్నివీర్ను రద్దుచేస్తామని పేర్కొన్నారు.
Read More :