అహ్మదాబాద్: భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మరికాసేపట్లో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దాంతో అభిమానులు ఇప్పటికే స్టేడియంలో కిక్కిరిసిపోయారు. భారత్ క్రికెట్ జట్టుకు అనుకూలంగా నినాదాలతో స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. స్టేడియం ప్రవేశ ద్వారాల దగ్గర కూడా అభిమానులు భారీ సంఖ్యలో సందడి చేస్తున్నారు.
ఈ సందర్భంగా భారత క్రికెట్ జట్టు మద్దతుదారుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ ఒళ్లంతా మూడు రంగులు (కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) పూసుకుని వచ్చాడు. ఛాతిపైన మిస్ యూ టెండూల్కర్ అని, నుదుటిపైన ఇండియా అని తెలుపు రంగుతో రాసుకుని వచ్చాడు.
ఈ సందర్భంగా మీడియా అతడిని పలుకరించగా.. ఈ ప్రపంచకప్ ఫైనల్లో 2011 ఫలితమే పునరావృతమవుతుందని చెప్పాడు. భారత్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్ సెంచరీలు చేయాలని, ఆస్ట్రేలియాకు 450 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి భారత్ సునాయంగా గెలువాలని ఆయన ఆకాంక్షించారు.
#WATCH | Ahmedabad, Gujarat: Sudhir Kumar Chaudhary, team India’s supporter and fan of Sachin Tendulkar, says, “Team India will repeat the 2011 win. I want Rohit Sharma and Shubman Gill to score centuries and give a target of 450 runs and win easily…”… pic.twitter.com/ywOSUIjKeA
— ANI (@ANI) November 19, 2023