దుబాయ్: పొట్టి ఫార్మాట్లో భారత్ సత్తాచాటింది. ఐసీసీ బుధవారం విడుదల చేసిన 2021-22 సీజన్ వార్షిక ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా టీ20 ఫార్మాట్లో అగ్రస్థానాన్ని అధిష్టించింది. టెస్టుల్లో రెండో ర్యాంక్కు చేరగా.. వన్డేల్లో మాత్రం నాలుగో ర్యాంక్కు పరిమితమైంది. ఈ ఏడాది మే 4 వరకు జరిగిన మ్యాచ్లను పరిగణనలోకి తీసుకుని ఐసీసీ ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 30 టీ20 మ్యాచ్లాడిన భారత్ 8,093 పాయింట్లు, 270 రేటింగ్తో పొట్టి ఫార్మాట్లో మొదటి ర్యాంకును ఆక్రమించింది. తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్, పాకిస్థాన్ నిలిచాయి. టెస్టుల్లో 23 మ్యాచ్లు ఆడి.. 2,736 పాయింట్లతో 119 రేటింగ్తో భారత్ ద్వితీయ స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా (128 రేటింగ్తో) అగ్రస్థానంలో నిలిచింది. వన్డేల్లో టీమ్ఇండియా నాలుగో ర్యాంక్లో ఉండగా.. న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వరుసగా తొలి మూడు ర్యాంక్ల్లో ఉన్నాయి.