శంకర్పల్లి, అక్టోబర్ ౨౮: రెండో తరగతి విద్యార్థిని ఓ టీచర్ చితకబాదారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్పందించిన డీఈవో వెంటనే సదరు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పట్టణంలోని పత్తేపూర్లో గురువారం చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. ఫత్తేపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండోతరగతి చదువుతున్న సంజీవ్కుమార్ అనే విద్యార్థి గురువారం తరగతి గదిలోకి వచ్చేటప్పుడు అనుమతి తీసుకునే సమయంలో నోట్లో నుంచి ఉమ్ము పడిందనే కారణంతో టీచర్ శ్వేత కట్టెతో చితకబాదింది. శరీరం మొత్తం గాయాలయ్యాయి. ఇంటికి వెళ్లిన బాలుడు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. తమ బిడ్డను కొట్టినందుకు బాలుడి తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన డీఈవో సదరు ఉపాధ్యాయురాలు శ్వేతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.