మహబూబాబాద్ : పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని పెద్ద వంగర మండలం గంట్లకుంటలో సీసీ రోడ్ల పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనంతగా గ్రామాలకు ఈ సారి సీసీ రోడ్లు వచ్చాయని తెలిపారు.
రోడ్లను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని ఆయన సూచించారు. ఈ మార్చిలోగా రోడ్లు పూర్తి చేస్తే, బిల్లులు త్వరగా వస్తాయని, మార్చి తర్వాత మరిన్ని నిధులు వస్తాయని తెలిపారు.
ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూడాలి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరుగుతున్నదని మంత్రి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.