రంగారెడ్డి : ట్యాంకర్ అదుపుతప్పి డీసీఎంను ఢీకొట్టడంతో ఇద్దరు డ్రైవర్లకు తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో రామోజీ ఫిలింసిటీ వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ట్యాంకర్ రామోజీ ఫిలింసిటీ వద్ద అదుపుతప్పి ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది.
అదే వేగంగా డివైడర్ను ఢీకొని అవతలి వైపు దూసుకెళ్లి నిలిచిపోయింది. ప్రమాదంలో రెండు వాహనాల్లోని ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి.
ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయిన ట్యాంకర్ను క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి