హైదరాబాద్: ఐటీఎఫ్ ప్రపంచ జూనియర్ టెన్నిస్ చాంపియన్షిప్లో బరిలోకి దిగే భారత అండర్-14 జట్టుకు హైదరాబాద్కు చెందిన యువ టెన్నిస్ ప్లేయర్ తానియా సరాయి గోగులమంద ఎంపికైంది. వచ్చే నెల 18 నుంచి 23 వరకు జరిగే అండర్-14 ఫైనల్ క్వాలిఫయింగ్ టోర్నీలో తానియా పోటీపడనుంది. ఈ టోర్నీలో 13 ఏండ్ల తానియాతో పాటు ఐశ్వర్య దయానంద్జాదవ్, సోహిని మొహంతి ఎంపికయ్యారు. జాతీయ అండర్-14 ర్యాంకింగ్స్లో ప్రస్తుతం మూడో ర్యాంక్లో కొనసాగుతున్న తానియా గతేడాది జరిగిన ఐటీఎఫ్ ప్రపంచ జూనియర్ టెన్నిస్ టోర్నీలోనూ సత్తాచాటింది.