చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ స్పెషల్ డీజీపీ రాజేశ్ దాస్ను తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మార్చి 18వ తేదీన ఆ ఆదేశాలు జారీ చేసింది. లైంగిక వేధింపుల కేసులో ఆ స్పెషల్ డీజీపీపై విచారణ పెడింగ్లో ఉన్నది. మరో మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ స్పెషల్ డీజీపీపై లైంగిక వేధింపుల కేసుల విచారణ జరుగుతున్నది. ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న ఆ ఆఫీసర్ను ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదని మద్రాసు హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాల్చింది.