కాబూల్, అక్టోబర్ 20: తాలిబన్లు తమ రాక్షస కాండను కొనసాగిస్తున్నారు. మహిళలు క్రీడలు ఆడొద్దని ఇటీవల హెచ్చరించిన ముష్కరులు.. అఫ్గాన్ అండర్-19 జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి మహ్జబిన్ హకీమీ తల నరికి దారుణంగా హత్య చేశా రు. అక్టోబర్ తొలివారంలో జరిగిన ఈ ఘాతుకాన్ని ఆ జట్టు కోచ్ వెల్లడించారు. విషయం బయటకు చెబి తే చంపుతామని బెదిరించడంతో హకీమీ కుటుంబం ఈ దారుణాన్ని బయటకు చెప్పలేదని తెలిపారు.