న్యూఢిల్లీ: స్విస్ ఓపెన్ రన్నరప్, భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకును మెరుగుపర్చుకున్నాడు. పురుషుల సింగిల్స్లో మూడు ర్యాంక్లు ఎగబాకి 52,875 పాయింట్లతో ప్రణయ్ 23వ ర్యాంకుకు చేరుకున్నాడు. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో స్విస్ ఓపెన్ విజేత పీవీ సింధు ఏడో ర్యాంకును పదిలపర్చుకుంది. పురుషుల్లో యువ షట్లర్ లక్ష్యసేన్ 9, కిడాంబి శ్రీకాంత్ 12, సాయి ప్రణీత్ 19వ ర్యాంక్లో ఉండగా.. మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ 23వ ప్లేస్లో కొనసాగుతున్నది.