ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో ఇవాళ ఎన్సీబీ చార్జిషీట్ను దాఖలు చేయనున్నది. ఆ చార్జిషీట్ సుమారు వెయ్యి పేజీలపైనే ఉంటుందని తెలుస్తోంది. ఈ కేసులో సుశాంత్ రాజ్పుత్ గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు శౌవిక్ చక్రవర్తితో పాటు మరో 33 మందిని అరెస్టు చేశారు. సుశాంత్కు డ్రగ్స్ అందించిన పెడ్లర్స్ తోపాటు సప్లయర్స్ ఉన్నారు. సుశాంత్ మృతి కేసుతో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసులో గత ఏడాది సెప్టెంబర్లో రియాను అరెస్టు చేశారు. ప్రస్తుతం రియా, ఆమె సోదరుడు శౌవిక్లు బెయిల్పై ఉన్నారు. గత ఏడాది జూన్ 14వ తేదీన సుశాంత్ అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో బాలీవుడ్కు చెందిన సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, దీపిక పదుకొణే, రకుల్ ప్రీత్ సింగ్, కరిష్మా ప్రకాశ్లను ఎన్సీబీ అధికారులు విచారించారు. ఎన్సీబీతో పాటు సీబీఐ, ఈడీలు కూడా ఈ కేసును విచారిస్తున్నారు.