Surya Kumar Yadav : సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20కి ముందు టీమిండియా వైస్ కెప్టెన్, వరల్డ్ నంబర్ 1 సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా కెరీర్ ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికే వచ్చాను అని సూర్యకుమార్ అన్నాడు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘నా కెరీర్ ఎక్కడ ప్రారంభం అయిందో అక్కడికి తిరిగొచ్చాను అని డ్రెస్సింగ్ రూమ్కు వచ్చాక టీమ్ మేనేజర్తో అన్నాను. ఈ స్టేడియంలో నాకు గుర్తుండిపోయే జ్ఞాపకాలు బోలెడు ఉన్నాయి. ఇదొక అందమైన స్టేడియం. ప్రేక్షకులు చాలా మద్దతు ఇస్తారు. రేపటి మ్యాచ్ కచ్చితంగా చాలా థ్రిల్లింగ్గా ఉండనుంది’ అని సూర్య తెలిపాడు. మూడేళ్ల క్రితం ఇదే మైదానంలో సూర్య టీ20ల్లో ఆరంగ్రేటం చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో అతను బరిలోకి దిగాడు.
వరల్డ్ నంబర్ 1 ర్యాంక్
తన విధ్యంసక ఇన్నింగ్స్లతో సూర్య అనతికాలంలో భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. పాకిస్థాన్ ఓపెనర్ రిజ్వాన్ను వెనక్కి నెట్టి వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో సూర్య మూడు శతకాలు బాదాడు. సూర్య త్వరలోనే టెస్టు ఆరంగ్రేటం చేయనున్నాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి రెండు టెస్టులకు అతడు సెలక్ట్ అయ్యాడు.
రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. స్పిన్నర్లకు సహకరిస్తున్న పిచ్పై 26 రన్స్తో నాటౌట్గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో నెగ్గిన భారత్ సిరీస్ సమం చేసింది. సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20 రసవత్తరంగా ఉండనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.