తమిళ హీరో సూర్య నటించిన కొత్త సినిమా ‘ఈటీ’. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. ప్రియాంక అరుళ్ మోహన్ నాయికగా నటించింది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు టీజర్ను శనివారం హీరో రానా విడుదల చేశారు. యాక్షన్ సన్నివేశాలతో ‘ఈటీ’ టీజర్ సాగింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ విడుదల చేస్తున్నది. మార్చి 10న విడుదలకు సిద్ధమవుతున్నదీ చిత్రం. సత్యరాజ్, రాజ్కిరణ్, శరణ్య ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : డి ఇమాన్, సినిమాటోగ్రఫీ : ఆర్ రత్నవేలు.