ఆదిలాబాద్, నవంబరు 29 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దామరచర్ల: తెలంగాణలోకి ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆంధ్రా- తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. తాజాగా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం సిరివెల్లి వద్ద మహారాష్ట్ర సరిహద్దులో చెక్పోస్ట్ను ఏర్పాటుచేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయని కారణంగా రాష్ట్ర రైతులకు నష్టం జరుగకుండా.. ఇతర రాష్ర్టాల నుంచి వడ్ల రవాణాను అరికడుతున్నారు. సోమవారం సిరివెల్లి చెక్పోస్టును నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్కుమార్ సందర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు చెక్పోస్టు వద్ద కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోకి వస్తున్న ధాన్యం లారీలను వాడపల్లి, నాగార్జునాసాగర్ సరిహద్దు చెక్పోస్టుల వద్ద పోలీసులు నిలిపివేసి, తిప్పి పంపుతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టును కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఎస్పీ రాజేంద్రప్రసాద్తో కలిసి తనిఖీ చేశారు.