న్యూఢిల్లీ: మతమార్పిడిల నియంత్రణకు చర్యలు చేపట్టాలని దాఖలైన పిటిషన్పై ఇవాళ సుప్రీం విచారణ చేపట్టింది. ఆ పిటిషన్ నేపథ్యంలో కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. మత మార్పిడులను అడ్డుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని, దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పిటిషన్లో కోరారు. బెదిరింపులతో మత మార్పిడులకు పాల్పడడం, ఏవైనా కానుకలు ఇచ్చి కానీ లేక డబ్బు ఇచ్చి ఆశ చూపి మత మార్పిడులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో సుప్రీంను కోరారు.