న్యూఢిల్లీ, నవంబర్ 22: కొవిడ్తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 వేల ఎక్స్గ్రేషియో పంపిణీ పురోగతిపై రాష్ర్టాల నుంచి సమాచారం సేకరించాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే పరిహారానికి సంబంధించి తమ ఆదేశాలకు విరుద్ధంగా గుజరాత్ ప్రభుత్వం పరిశీలన కమిటీని ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీచేయడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్ని కుటుంబాటు పరిహారం అందుకున్నాయని ప్రశ్నించింది.