నారాయణపేట టౌన్, డిసెంబర్ 27 : రైతులు పండించిన పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీసం మద్దతు ధరలు ని ర్ణయించాలని అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రా ష్ట్ర నాయకుడు యాదగిరి అన్నారు. ఏఐపీకేఎస్ జనరల్ కౌన్సిల్ పిలుపు మేరకు పట్టణంలో బీఆర్ అంబేద్క ర్ చౌరస్తా నుంచి మున్సిపల్ పార్క్ వరకు మంగళవారం నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ ద్దతు ధరల చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలు, ప్రకృతి వైపరిత్యాలు రైతులను నష్టపెడుతున్నాయని, మోదీ ప్ర భుత్వ విధానాలతో రైతులకు అప్పులు పెరిగి వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. రైతాంగం సమైక్యంగా, చైతన్యవంతంగా ఉండి తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చే యాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పేద, మధ్య తరగతి రైతుల రుణాలన్ని మాఫీ చేయాల ని, కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని, 60 ఏండ్లు దాటిన రైతులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు.అనంతరం ఏవో నర్సింగరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐపీకేఎస్ జిల్లా నాయకులు వెంకట్రాములు, చెన్నారెడ్డి, నారాయ ణ, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి నర్సింహులు, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.